ఇక పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.'రియల్టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్' పేరుతో కొత్త తరహా పర్సనల్ లోన్ ప్రొడక్ట్ ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఇంకా అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సిబ్బంది కోసం ఈ పర్సనల్ లోన్ ఆఫర్ ప్రకటించింది.వీరంతా కూడా బ్రాంచ్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొన్ని నిమిషాల్లోనే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ హిస్టరీ వివరాలు, అర్హత, డాక్యుమెంటేషన్ ఇంకా అలాగే లోన్ మంజూరు ప్రాసెస్ మొత్తం డిజిటల్ పద్ధతిలో రియల్టైమ్లో జరిగిపోతుంది.ఇక ఇప్పటికే యోనో యాప్లో కస్టమర్లు అందరికీ ఎస్బీఐ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అందిస్తున్న సంగతి కూడా తెలిసిందే.అలాగే ఎస్బీఐ అందిస్తున్న రియల్టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ (RTXC) తీసుకోవాలనుకునేవారు యోనో ప్లాట్ఫామ్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి అర్హులైన వారికి రూ.35 లక్షల వరకు లోన్ నిమిషాల్లో మంజూరవుతుంది. పర్సనల్ లోన్ అప్లికేషన్ నుంచి లోన్ అకౌంట్లో జమ కావడం వరకు 100 శాతం పేపర్లెస్ ఇంకా అలాగే డిజిటల్ పద్ధతిలో పూర్తవుతుంది.కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా రక్షణ శాఖ ఉద్యోగులు యోనో యాప్ ద్వారానే రియల్టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్కు అప్లై చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం యోనో ఎస్బీఐ ఆండ్రాయిడ్ యాప్లో మాత్రమే ఈ సదుపాయం అనేది ఉంది. అలాగే రియల్టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు తక్కువ అని ఎస్బీఐ ప్రకటించింది. ఇప్పుడు ఈ లోన్కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.అర్హులైన ఉద్యోగులు ముందుగా యోనో యాప్ ని డౌన్లోడ్ చేయాలి. తరువాత తమ వివరాలతో ముందుగా రిజిస్టర్ చేయాలి. ఇక ఇప్పటికే యోనో యాప్లో రిజిస్టర్ అయినవారు నేరుగా లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత లోన్ ఆప్షన్స్లో రియల్టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ పైన వారు క్లిక్ చేయాలి. తమ అర్హతలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి.ఇక ఆ తర్వాత మీరు లోన్ ఎంతకావాలో ఎంటర్ చేసి, టెన్యూర్ ఎంచుకోవాలి. తరువాత సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ అకౌంట్లో లోన్ డబ్బులు జమ అవుతాయి. అన్ని అర్హతలు ఉన్నవారికి వెంటనే లోన్ వెంటనే మంజూరు చేస్తుంది. గరిష్టంగా రూ.35 లక్షల వరకు లోన్ ని తీసుకోవచ్చు.