కోకాాపేటలో రికార్డు ధర
ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ ఖజానా కాసులతో నిండిపోయింది. కోకాపేట భూముల వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ముందుగా ఊహించిన దానికంటే రెట్టింపు ధరను ఈ కోట్ చేశారు బిల్డర్లు. ఈ ధరతోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేటే వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచు. గజం భూమి దొరికితే చాలు అనుకునే పరిస్థితి కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొంది.
రేపు ఖానామెట్ లోని 15.01 ఎకరాల భూమికి ఆన్ లైన్ లో వేలం నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం ఖానామెట్ లో ఎకరాని కనీస ధరను రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ధర కూడా రెట్టింపు వచ్చేలా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే... మరో రూ.750 కోట్లు ఖజానాకు జమయ్యే ఛాన్స్ ఉంది. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు భూముల వేలం కొంత ఊరట ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ వేలంతో పాటు ఇక్కడ జరిగే వ్యాపారం వల్ల కూడా ఖజానాకు మరింత లాభం జరిగనుంది.దీంతో హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతం మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి బంగారు గనిలా రుజువు చేసుకుంది.