ఐదు వేలతో లక్షలు సంపాదించే అవకాశం.. ఎలాగంటే?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్- బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్లో పీపీఎఫ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇందులో 15 ఏళ్లు డబ్బులు పెట్టాలి. ఏడాదికి 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల 7.1 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెలకు రూ.5 వేలు పెట్టినా మెచ్యూరిటీలో రూ.16 లక్షలకు పైగా వస్తాయని అంటున్నారు.
ఇకపోతే ప్రస్తుతం బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బంగారం పై ఇన్వెష్ట్ చేస్తే లాభాలను పొందవచ్చు. గత ఏడాది భారీగా పెరిగిన బంగారం ధరలు అందరికీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది కూడా అదే దారిలో నడుస్తున్నాయి. ఇప్పుడు గోల్డ్ మీద ఎటువంటి ఆదాయం పొందవచ్చు నంటే..గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బాండ్లు వంటి వాటిల్లో డబ్బులు పెట్టొచ్చు. ఇవి కూడా లాభాలను ఇస్తాయి.
ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటుంటారు. 12 శాతం వరకు రాబడి పొందే ఛాన్స్ ఉంటుంది. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. నెలకు రూ.5 వేలు పదేళ్లపాటు పెడితే.. రూ.11 లక్షలకు పైగా పొందే అవకాశం ఉంటుంది.
రికరింగ్ డిపాజిట్ .. రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెలా కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ కాలంలో మంచి రాబడి పొందొచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఆర్డీ తెరవొచ్చు. 5.5 శాతానికి పైగా వడ్డీ వస్తుంది. నెలకు రూ.5 వేలు పెడితే పదేళ్లలో రూ.8 లక్షలు వస్తాయి...
చూసారుగా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇలా ఇన్వెష్ట్ చేస్తే ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చు..