గేమ్‌ ఛేంజర్‌కు హైకోర్టులో బ్రేక్ పడుతుందా?

frame గేమ్‌ ఛేంజర్‌కు హైకోర్టులో బ్రేక్ పడుతుందా?

Chakravarthi Kalyan
రామ్‌ చరణ్‌, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఇవాళ రిలీజైంది. అయితే.. ఈ సినిమాకు ఇవాళ హైకోర్టులో షాక్ తగులుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్‌ షోలపై నిన్న హై కోర్టులో విచారణ జరిగింది. దీనిపై గొర్ల భరత్‌ రాజ్  పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను లంచ్ మోషన్ పిటీషన్‌గా జస్టిస్ బి.విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ చేపట్టారు.
పిటీషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మహేష్‌.. తెల్లవారుజాము 4.30గంటలకే సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. టికెట్ ధరలకు పెంచుతూ అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్న న్యాయవాది వాదించారు. ఇలాంటి ఉత్తర్వులివ్వకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరిన న్యాయవాది కోరారు. తరచూ ఇలాంటి మెమోలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. మరి ఇవాళ కోర్టులో ఏం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More