గ్రూప్1: ఓఎంఆర్ షీట్లు పెట్టకుండా.. కీ ఇచ్చి ఏం లాభం? తలాతోకా లేని టీజీపీఎస్సీ తీరు?
పరీక్ష నిర్వహించిన నాలుగైదు రోజుల్లోనే ప్రాధమిక కీ విడుదల చేయడంలో టీజీపీఎస్సీ చొరవ అభినందించదగిందే అయినా.. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు మాత్రం అప్లోడ్ చేయలేదు. ఓఎంఆర్ షీట్లు ఆన్లైన్లో పెట్టకుండా కీ ఇస్తే పరీక్ష రాసిన అభ్యర్థులు ఎలా చెక్ చేసుకుంటారన్న చిన్న లాజిక్ను కమిషన్ మరిచినట్టు కనిపిస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు తాము ఏ సమాధానాలు పెట్టామో గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడు కీతో పాటు ఓఎంఆర్ కూడా ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇలాగే ఇచ్చిన కమిషన్ ఇప్పుడు ఓఎంఆర్ ఇవ్వడం మరిచింది. కమిషన్ త్వరగా ఓఎంఆర్ షీట్లు అప్లోడ్ చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.