ఆహాలో అలరిస్తున్న సందీప్‌ కిషన్‌ సస్పెన్స్ థ్రిల్లర్ 'ప్రాజెక్ట్ z'?

Chakravarthi Kalyan
ప్రాజెక్టు z.. సందీప్‌ కిషన్‌ లేటెస్ట్‌ మూవీ 'ప్రాజెక్ట్ z' ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ నిర్మించారు.  ఆద్యంతం ఆసక్తి కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠతతో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు నటన, యూనిక్ కథ, కథనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.  
టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతూ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ కొనసాగుతోంది ప్రాజెక్ట్ z. కథలో అనూహ్యమైన మలుపులు, అలరించే భావోద్వేగాలు.. ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచాయి. ఇప్పటి వరకూ చూడకపోతే.. ఈ సినిమాపై ఓ లుక్కేయండి.. చూడటం ప్రారంభించారంటే.. పూర్తయ్యే వరకూ ఆగలేరు సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: