ఆ థియేటర్ల మూసివేత నిజం కాదట.. ఇదీ అసలు విషయం?
తక్కువ వసూళ్లు రావడంతో కొందరు యజమానులు వ్యక్తిగత నిర్ణయం తీసుకొని థియేటర్లను మూసివేశారని ప్రసన్న కుమార్ అన్నారు. దానికి నిర్మాతల మండలికి సంబంధం లేదని ప్రసన్నకుమార్ తెలిపారు. ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్ లు సినిమా ఆదాయంపై ప్రభావం చూపడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోయారన్న ప్రసన్న కుమార్.. అందువల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్ యజమానులు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని ప్రదర్శనలు ఆపేశారన్నారు.