రజాకార్ల ప్రతినిధి అసదుద్దీన్‌.. పాతబస్తీలో అమిత్‌షా ఫైరింగ్‌?

Chakravarthi Kalyan
రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించాలని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాతబస్తీలో పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలో అమిత్ షా రోడ్‌షో నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి మాధవిలతను గెలిపించి... మోదీ నాయకత్వానికి మద్దతివ్వాలని అమిత్‌ షా కోరారు. మజ్లిస్‌ నుంచి హైదరాబాద్‌కు విముక్తి కలిగించాలని అమిత్‌ షా కోరారు. 400 సీట్లతో మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని... ఈసారి గెలిచే స్థానాల్లో భాగ్యనగరం కూడా ఉండాలన్నారు.

సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలో కేంద్రమంత్రి అమిత్‌ షా రోడ్‌షో నిర్వహించారు. తొలుత లాల్‌ దర్వాజ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తర్వాత లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం నుంచి సుధా సినిమా థియేటర్ వరకు రెండు కిలో మీటర్ల మేర రోడ్ షో చేపట్టారు. అమిత్‌షా కు కాషాయ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: