తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్‌షా క్లాస్‌.. అలా చేస్తే 12 సీట్లు మనవే..?

Chakravarthi Kalyan
పాతబస్తీలో నిన్న రోడ్‌ షో నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్‌ షా.. ఆ తర్వాత నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో అమిత్‌ షా సమావేశం అయ్యారు.  విబేధాలను పక్కన పెట్టి.. నేతలు సమన్వయంతో పనిచేయాలని అమిత్‌ షా క్లాస్‌ పీకారు.  లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళి, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్‌ షా ఆరా తీశారు. బీజేపీకు 12 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని... కష్టపడితే మరిన్ని సీట్లలో విజయం సాధించవచ్చని అమిత్‌ షా అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను వెళ్లి కలవాలని అమిత్‌ షా సూచించారు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నేతలకు అమిత్‌ షా సూచించారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలపై కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ర్పచారాన్ని ఖండించాలని అమిత్‌షా తేల్చి చెప్పారు. మరి బీజేపీ నేతలు ఎంత వరకూ కలసి పని చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: