చిత్రపురిలో రూ. 3000 కోట్ల కుంభకోణం..?
గతంలో రేవంత్ రెడ్డి భారాస ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తే అప్పుడు ఫోన్ చేశారా అని ప్రశ్నించిన క్రిశాంక్... తాము అణచివేస్తే రాజకీయాలు చేసేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదా అని అడిగారు. చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల మహానందరెడ్డి ఎవరో తెలియదని అంటున్నారని.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయని తెలిపారు. చిత్రపురిలో 3000 కోట్ల కుంభకోణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు.