గుడ్న్యూస్: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి వరాలు?
రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత ప్రభుత్వంలో మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదని.. వీటి పరిష్కార బాధ్యతను కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణలో తగిన న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నాలుగు పెండింగ్ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.