పార్లమెంటుపై కన్నేసిన కేజ్రీవాల్‌.. కొత్త నినాదం?

Chakravarthi Kalyan
ఆమ్‌ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పార్లమెంటులోనూ కేజ్రీవాల్‌ ఉంటే.. దిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందనేది తమ నినాదమని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం చేసిన పనుల కరపత్రాలను ఆప్‌ కార్యకర్తలు పంపిణీ చేస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలనూ ఆప్‌ కైవసం చేసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ధీమా వ్యక్తం చేశారు.
లోక్‌సభలో ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉంటే నిధులను ఆపేందుకు ఎవరూ సాహసం చేయరని మాన్‌ అన్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌తో కలిసి దిల్లీ, గుజరాత్‌, హరియాణాలో పోటీ చేస్తున్నామని.. పంజాబ్‌లో మాత్రం వేర్వేరుగా బరిలో నిలుస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. దిల్లీ డీడీయూ మార్గ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ , పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: