పార్లమెంటుపై కన్నేసిన కేజ్రీవాల్.. కొత్త నినాదం?
లోక్సభలో ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉంటే నిధులను ఆపేందుకు ఎవరూ సాహసం చేయరని మాన్ అన్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో కలిసి దిల్లీ, గుజరాత్, హరియాణాలో పోటీ చేస్తున్నామని.. పంజాబ్లో మాత్రం వేర్వేరుగా బరిలో నిలుస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. దిల్లీ డీడీయూ మార్గ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆప్ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు.