రేవంత్ సర్కారు కూలేదప్పుడే.. తేల్చేసిన కేసీఆర్?
ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపుదామని కేసీఆర్ అన్నారు. ఏడాది, రెండో ఏడాది, ఐదేళ్లు ఎన్నికలు ఎపుడు వచ్చినా పూర్తి సిద్దంగా ఉండాలన్న కేసీఆర్.. రాబోయే కాలం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో అద్భుతమైన అభివృద్ధి చేశామన్న కేసీఆర్.. కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామన్నారు. నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.