ఇందిరమ్మ ఇల్లు కావాలా.. ఇవే కండీషన్లు?

Chakravarthi Kalyan
రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో గ్యారంటీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనుంది. ఆరు గ్యారంటీల్లోని 13 పథకాల్లో ఇప్పటికే నాలుగింటిని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇళ్లు లేని నిరుపేదలకు స్థలం, 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు.

అయితే ఈ ఇళ్లు అందరికీ రావు.. మొదటి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. దశలవారీగా అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే పక్కా ఇల్లు ఉన్నవారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరదు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నిబంధనలను అధికారులు వెల్లడించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: