జగన్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు?
ప్లాట్లను రద్దు చేస్తూ తమకు ఇచ్చిన నోటీసులు ను హైకోర్ట్ లో రైతులు సవాల్ చేయగా.. రైతుల తరపున న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్ బాబు, ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. వీరి వాదనలను పరిగణలోకి తీసుకుంది. మొత్తం 862 ప్లాట్లు రద్దు చేస్తూ CRDA నోటీస్ లు ఇవ్వగా.. ఈ నిర్ణయం CRDA చట్టం,మాస్టర్ ప్లాన్ కు విరుద్ధమని ఈ న్యాయవాదుల వాదనలు వినిపించారు. అయితే చట్టంలో మార్పులు తెచ్చామని ప్రభుత్వ న్యాయవాది వివరించినా.. ఇరుపక్షాల వాదనలు అనంతరం రద్దు నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.