తెలంగాణ: బీజేపీకి పది, బీఆర్ఎస్కు ఏడు?
బీఆర్ఎస్ను బీజేపీనే ఎదుర్కొంటుంది అని మూడు సార్లు తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని.. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నారని.. కేజ్రీవాల్ హైదరాబాద్ వస్తే కేసీఆర్ ఇంటికి వెళ్తారు...వీళ్లిద్దరూ ఒక్కటేనని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీలో లిక్కర్ దుకాణం పెట్టి కొత్త దందా మొదలు పెట్టారు..ఢిల్లీ డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నారని.. ఇక్కడ ఉన్న తెలంగాణ చెల్లె బతుకమ్మ పైసలు సరిపోతలేవు అని కొత్త దందా మొదలుపెట్టిందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్, భారాసా పార్టీలు బొమ్మ బొరుసు లాంటివన్న రఘునందన్ రావు.. బీజేపీ కార్యకర్తలు తప్పుడు వార్తలు నమ్మకండన్నారు.