హైదరాబాద్ సమీపంలో మరో అద్భుత దేవాలయం?
22 ఎకరాల్లో నిర్మితమైన ఈ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను మార్చి 1 నుంచి 6 తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మార్చి 6 తేదీ ఉదయం 11.06 నిమిషాలకు త్రిదండ చిన శ్రీమన్నారాయణ రామానునజ జీయర్స్వామి చేతులు మీదుగా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ఆలయ నిర్మాణం చేసినట్లు శిల్పి డీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.