భీమిలి తీరాన్ని విజయసాయిరెడ్డి కబ్జా పెట్టేశారా?
ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా పలు సీ ఆర్ జడ్ ఉల్లంఘనలను చేయించిన విజయసాయి రెడ్డి ఇప్పడు తానే స్వయంగా అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ అంటున్నారు. సీ ఆర్ జడ్ ఉల్లంఘలతో కట్టిన భీమిలి బీచ్ లో ఉన్న ప్రహరీలను కూల్చేయాలని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్, జివిఎంసి కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.