అమిత్షా అపాయిట్మెంట్ కోసం బాబు అన్ని తిప్పలా?
మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాడని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడని లక్ష్మీపార్వతి అన్నారు. నేడు కేసుల భయంతోనే బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని లక్ష్మీపార్వతి అన్నారు. బీజేపీకి చంద్రబాబు ఎంత డబ్బు అయినా ఇస్తానంటున్నాడని.. కేసుల నుంచి బయటపడేమయని పెద్దల్ని వేడుకుంటున్నాడని అన్నారు.