ఫ్రీ టికెట్‌.. కండక్టర్‌ను తన్నింది.. జైల్లో కూర్చుంది?

Chakravarthi Kalyan
హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర్‌ పేటకు చెందిన సయ్యద్‌ సమీనాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసు విచారణను త్వరతిగతిన చేపట్టి నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన, దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించదు అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. పోలీస్‌ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్‌ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. 45 వేల మంది ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: