ఆహో..ఓహో అంటూ పరువు తీసుకున్న జనసేన?
అంతే కాదు..ఈ బడ్జెట్ పర్యాటక రంగానికి పెద్దపీట వేసిందని.. పేదలకు ఇల్లు నిర్మాణం విషయంలో కేంద్రం ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పడం హర్షించదగిన పరిణామం అంటూ ఆ పార్టీ నేతలు స్పందించారు. అలాగే రైతులు, యువత, మహిళలకు స్వాంతన చేకూర్చే కొన్ని పథకాలను ప్రవేశ పెట్టడం బాగుందంటూ మెచ్చుకున్నారు. సౌర విద్యుత్తును ప్రోత్సహించేలా 300 యూనిట్ల కరెంటును ఉచితంగా అందించే పథకం అభినందనీయమని ప్రకటించారు. ఈ స్థాయిలో బడ్జెట్ను పొగడటం చూసి ఔరా అనుకుంటున్నారంతా.