డీజీపీ సార్.. కాంగ్రెస్ దాడుల నుంచి కాపాడండి?
హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం కిష్టాపురం జడ్పీటీసీ, ఎంపీటీసీలపై జరిగిన దౌర్జన్యం, ఇదే నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో తమ పార్టీ మండల ఉపాధ్యక్షుడిపై దాడి, భూపాలపల్లి, మానకొండూరు, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భౌతికదాడులు, హత్య, హత్యా ప్రయత్నాల గురించి వారు వివరించారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలోనే ఆయన ప్రేరణతోనే కాంగ్రెస్ శ్రేణులు భువనగిరి జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై దుర్బాషలాడి దాడికి పాల్పడ్డారని డీజీపీ రవిగుప్తాకు తెలిపారు.