జగన్.. అంత పైశాచికానందం దేనికి?
రివర్స్ బారోయింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం లెక్కతేలని అప్పులు చేసిందన్న నాదెండ్ల మనోహర్.. ఆర్థిక శాఖ ద్వారా తెచ్చిన 1.72 లక్షల కోట్ల అప్పులతోపాటూ ప్రభుత్వం అదనంగా 91వేల 253.29 కోట్లు అప్పు చేసిదన్నారు. దీనికి లెక్కలు తేలడం లేదని మనోహర్ అంటున్నారు. ఈ డబ్బు ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదన్న నాదెండ్ల మనోహర్ ఈ లెక్కలపై బహిరంగంగా చర్చించడానికి జనసేన సిద్ధంగా ఉందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా చర్చించేందుకు రావాలని మనోహర్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.