కులాల లెక్కలపై నిలదీస్తూ జగన్ను పవన్ లేఖాస్త్రం?
బీహార్ ప్రభుత్వం చేసిన కులగణన సుప్రింకోర్టులో ఉందని.. ఆ తీర్పు రాకముందే కులగణన పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేయటం కాదా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సంక్లిష్టమైన జనగణన ప్రక్రియను నిపుణులతో కాకుండా ఎలాంటి అర్హతలు ఉన్నాయని వాలంటీర్లతో చేయించాలని చూస్తున్నారని పవన్ కల్యాణ్ అడిగారు. గతంలో కేంబ్రిడ్జ్ అనలిటిక ఇలాంటి డేటా సేకరించినప్పుడు సమాజంలో అశాంతి చెలరేగిందని.. ఎన్నికల కోసం, స్వీయ ప్రయోజనాల కోసం మీరు వాడుకున్నారనే విషయం మాకు తెలియదా అని పవన్ కల్యాణ్ అన్నారు.