బయటికు వచ్చేది అప్పుడే.. తేల్చి చెప్పిన కేసీఆర్?
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై వారికి కేసీఆర్ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలన్న ఆయన.. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టమని... ఆపరేషన్ మ్యానువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని కేసీఆర్ ఎంపీలకు తెలిపారు.