బిగ్ బ్రేకింగ్: వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్?
దేశంలోని రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ నా ఈ పురస్కారాన్ని సగర్వంగా అంకితం చేస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ పురస్కారం నా బాధ్యతను మరింతగా పెంచిందన్న వెంకయ్య నాయుడు.. నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. శక్తివంతమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలసి నడుస్తానని ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నానని వెంకయ్య నాయుడు స్పందించారు.