1174 హెక్టార్ల భూములిచ్చారు.. రేవంత్ ఒప్పందం?
తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ కేంద్రం 1990 నుంచి సేవలు అందిస్తోంది. ఇప్పుడు రెండో స్టేషన్ దామగూడం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 2010లోనే నిర్ణయం జరిగింది. కేంద్రం అటవీ పర్యావరణ శాఖ 2014లో నేవీ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. అటవీ భూముల కోసం సుమారు 155 కోట్ల రూపాయలను నేవీ తెలంగాణకు చెల్లించింది. ఈ దామగూడం నేవీ రాడార్ కేంద్రం 2027 వరకు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.