తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్?
ఈ మార్చి నెలాఖరు నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల పదవీ విరమణలు ప్రారంభమవుతాయి. అందుకే కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. అయితే గత ఏడాది ఆగస్టులో కేసీఆర్ సర్కారు 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. పాత నోటిఫికేషన్కు సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారు.