హైదరాబాద్‌ నేతలకు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్‌?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమైన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. హైదరాబాద్‌లో భారాసకు అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్‌ పటిష్టంగా ఉందన్న కేటీఆర్.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగిరేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్ధామన్నారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడకుండా ప్రజల తరఫున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్ధామని కేటీఆర్ అన్నారు.


బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్.. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని.. అయితే హామీలు నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నగర అభివృద్ధి కోసం ఎప్పటిలానే నిరంతరంగా కృషి చేస్తుందని కేటీఆర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: