రేకుల షెడ్డులోనైనా ఉంటా.. రేవంత్ సంచలనం?
కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని.. శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారాస ప్రభుత్వం 12, 14 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదని.. హైదరాబాద్ లో మాత్రమే 24గంటలు ఉంటున్నదన్నారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ సమావేశాల అజెండాను బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తాని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారుల బదిలీలు, నియామకాల్లో ఎలాంటి పైరవీలు లేవని సీఎం రేవంత్ పేర్కొన్నారు.