వ్యవసాయంపై తుమ్మల మార్కు.. సాధ్యమేనా?
ఈ కార్పొరేషన్లు విజయవంతంగా రైతులకు సేవలు అందించేందుకు అవసరమైన పద్ధతులు అవలంభించాలని.. వ్యవసాయ పంటల సాగులో ఇతర దేశాలు అనుసరిస్తున్న అత్యాధునిక విధానాలు మనం అలవరుచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఇతర దేశాల నుంచి అత్యాధునిక పద్దతులు అందిపుచ్చుకుని రైతులకు లబ్ధిచేకూర్చేలా పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు. కార్పొరేషన్లు కేవలం వ్యాపార దృక్పథంతోనే పనిచేయవద్దని... రైతులకు ఉపయోగపడేలా విధానాలు అమలు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.