హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ఐదు రోజులు ఇక్కడే?

Chakravarthi Kalyan
శీతాకాల విడిది లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజుల విడిది అనంతరం ఆమె ఈ నెల 23న ద్రౌపది ముర్ము తిరుగు ప్రయాణమవుతారు. ఈ సందర్భంగా తగిన భద్రత, ట్రాఫిక్‌, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతికుమారి సూచించారు. ఆరోగ్య, రోడ్లు భవనాలు, మున్సిపల్‌, విద్యుత్, సంబంధిత శాఖలు కూడా బ్లూ బుక్‌ ప్రకారం ఫూల్‌ప్రూఫ్‌ ఏర్పాట్లు చేయాలని శాంతికుమారి ఆదేశించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన రీతిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై సీఎస్ వివిధ శాఖల అధికారులతో  డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: