లోకేశ్‌ను సీఐడీ అడిగిన ఆ ఒక్కప్రశ్న ఏంటో తెలుసా?

Chakravarthi Kalyan
నారా లోకేష్‌ను సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. సీఐడీ.. 41ఏ కింద నోటీసులు ఇచ్చి హాజరుకావాలని కోరారు. సీఐడీ నోటీసుల మేరకు విచారణకు వచ్చిన లోకేష్‌ ను అధికారులు ఆరున్నర గంటల సేపు విచారించారు. సీఐడీ అధికారులు మొత్తం 50 ప్రశ్నలు అడిగారు: లోకేష్‌
హెరిటేజ్‌ గురించి, నా పదవుల గురించి అడిగారు. ఇన్నర్ రింగ్‌ రోడ్‌కు  సంబంధం లేని 49 ప్రశ్నలు అడిగారని లోకేష్‌ చెప్పారు. అన్నీ ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని లోకేష్‌ చెప్పారు.

అయితే.. ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కు సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అడిగారట. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్‌ ముందుకు వచ్చిందా అని అడిగారట. ఐఆర్‌ఆర్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదట. రేపు మరోసారి విచారణకు రావాలని 41ఏ నోటీసు ఇచ్చారని.. రేపు మళ్లీ సీఐడీ విచారణకు హాజరవుతానని లోకేష్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: