బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కుట్ర జరుగుతోందా?
మహారాష్ట్ర, కర్ణాటక వ్యక్తుల ఓట్లు తెలంగాణలో నమోదయ్యయన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉమ్మడి రంగారెడ్డి లో ఎక్కువగా దొంగ ఓట్లు పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోషామహల్ సెగ్మెంట్ లో ఓట్లు తగ్గుతున్నాయని.. మిగతా సెగ్మెంట్లలో పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు.