అక్కినేని నాగార్జున సోదరిపై కేసు నమోదు?

Chakravarthi Kalyan
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిన్న మంగళవారంలోని శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ట్రస్ట్ సంబంధించిన రెండు ఎకరాలకు భూ వివాదంలో అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగ సుశీల పై కేసు నమోదైంది. ఆదివారం రాత్రి ఈ కేసు నమోదు చేశారు. ఈ నెల 12వ తేదీన ట్రస్టు సంబంధించిన భూమిలోకి వచ్చి అందులో ఉన్న వ్యక్తులపై దౌర్జన్యం చేశారని ట్రస్ట్ ట్రెజరర్ మంజుల ఫిర్యాదు చేశారు. గతంలో ట్రస్ట్ సంబంధించిన భూమిలో నాగ సుశీల ఒక భాగస్వామిగా ఉన్నట్టు తెలిసింది.

అయితే ఆమె గతంలోనే తనకు వాటా అమ్ముకోవడం జరిగిందని సంస్థ సభ్యులు అంటున్నారు. ఈ భూమి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తుందని తెలిసింది. ఇప్పుడు ఆ భూమి విలువ పెరగడంతో నాగ సుశీల కుమారుడు సుశాంత్ దౌర్జనంగా భూమిలోకి  వచ్చినట్లు వారు తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే నాగ సుశీల కూడా ట్రస్టు సభ్యులపై ఫిర్యాదు చేసినట్లు సిఐ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: