గుడ్న్యూస్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేది అప్పుడే?
పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా బ్రతకాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దరఖాస్తు చేసుకున్న వారికి దశల వారిగా అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.