తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్?

Chakravarthi Kalyan
తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ ఉంటుందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోష్యం చెప్పారు. కుటుంబ పార్టీ మాదిరి ఇంట్లో కూర్చొని టిక్కెట్లు ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది కదా అలా చేయలేదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేయడం భయంతోనని ప్రజలు అనుకుంటున్నారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.


తాను, తన భార్య ఉత్తమ్‌ పద్మావతి ఇద్దరం హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల నుంచి దరఖాస్తు చేసినట్లు పేర్కొన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్‌ చేస్తామన్నారు. దేశంలో లిక్కర్ అమ్మకాల్లో...అవినీతిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద లక్షా ఇరవై వేల రూపాయల అప్పు చేశారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: