బీసీ విద్యార్థులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలోని బీసీ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్‌ గుడ్ న్యూస్‌ చెప్పింది. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందేందుకు అర్హులైన బీసీ, ఇబీసీ అభ్యర్దుల నుంచి తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. దీనిపై బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ వెంకటేశం తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకం క్రింద విదేశాలలో పీజీ విధ్యను అభ్యసించాలనుకునే బీసీ, ఇబీసీ  విద్యార్దులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరానికి  సెప్టెంబర్ – అక్టోబర్ సెషన్ కు సంబంధించి అభ్యర్దుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్‌ 30 తేదీతో  ముగుస్తుంది.  అభ్యర్ధులు సెప్టెంబర్‌ 30 తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలి.  ఇతర వివరాలకు, ఆన్ లైన్ అప్లికేషన్లకు  https://www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: