తెలంగాణ గవర్నర్పై ఎర్రన్నల ఆగ్రహం?
ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందే మూడు రోజుల పాటు ఆపారని, ప్రభుత్వ వివరణ తరువాత సభలో ప్రవేశపెటేందుకు సమ్మతించారన్న కూనంనేని సాంబశివరావు.. ఉభయ సభల్లో ఆమోదించిన అదే బిల్లుపై పది రోజులు దాటినా ఆమోదముద్ర వేయడం లేదని విమర్శించారు. ఈ బిల్లుపై అంగీకారం తెలిపేందుకు జరుగుతున్న జాప్యం సుమారు 43వేల మందికి పైగా ఆర్టీస ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తున్నదని కూనంనేని సాంబశివరావు అన్నారు.