లోకేశ్‌కు జోడీగా ఉదయభాను.. వైసీపీ సెటైర్లు?

Chakravarthi Kalyan
నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గళం పాద‌యాత్రలో ఇటీవల ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఒంగోలులో ఏర్పాటు చేసిన బీసీ సదస్సుకు నారా లోకేశ్‌ తో పాటు యాంకర్ ఉదయభాను కూడా పాల్గొంది. ఓ యాంకర్‌గా ఆమె కార్యక్రమం నడిపించింది. అయితే సినిమా ఫంక్షన్ల మాదిరిగా రాజకీయ కార్యక్రమాన్ని నడిపించడం విమర్శలకు తావిస్తోంది.

దీనిపై వైసీపీ నేతలు సెటైర్లు విసురుతున్నారు. లోకేశ్‌ కార్యక్రమానికి స్పంద‌న లేక‌పోవ‌డంతో టీవీ యాంక‌ర్‌తో కార్యక్రమం నిర్వహించారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన‌కార్యద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. యువగళానికి స్పందన కరువై, ఎవరూ గాలానికి చిక్కడం లేదని.. యాంకర్ గళాన్ని జోడించారు లోకేష్ అని సెటైర్‌ వేశారు. అయితే.. ఎన్ని పగటి కలలుకన్నా, డ్రామాలు వేసినా ప్రయోజనం లేదు బాబూ అంటూ విజ‌య‌సాయి ఎద్దేవా చేశారు. లోకేశ్‌ తన చిన్ననాటి చందమామ కథలు ఆపేసి ప్రజలకు ఏం చేస్తారో చెబితే సంతోషిస్తాం కదా అంటూ విజ‌య‌సాయిరెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: