ఈటల Vs బండి సంజయ్‌.. ఆఫీసులోనే డిష్యుం డిష్యుం..?

Chakravarthi Kalyan
బీజేపీలో ఈటల, బండి సంజయ్ వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. చివరకు ఏకంగా బీజేపీ  రాష్ట్ర కార్యాలయంలోనే కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. తాజాగా ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత ఈటల రాజేందర్ అనుచరులు బీజేపీ ఆఫీసులో హల్ చల్
సృష్టించారట. బీజేపీ సోషల్ మీడియా టీంపై ఈటల అనుచరుల ఆగ్రహాం వ్యక్తం చేశారట.

ఈటలకు వ్యతరేకంగా గతంలో  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదే అంశంపై బీజేపీ స్టేట్ ఆఫీస్  సోషల్ మీడియా ప్రతినిధులను ఈటల అనుచరులు ప్రశ్నించారు. దీంతో పరస్పరం ఇరు వర్గాల నేతలు దుర్భాషలాడుకున్నారు. అధ్యక్షుడి మార్పు సమయంలో  ఈటల రాజేందర్, బండి సంజయ్ వర్గాలు పోటాపోటీ పోస్టులు పెట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై బీజేపీ ఐటీ సెల్ ప్రతినిధులనుఈటల వర్గం నేతలు  నిలదీశారట. మొత్తానికి బీజేపీ స్టేట్‌ పార్టీలో గొడవలు బాగా ముదిరినట్టున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: