తెలంగాణలో ఆ కులస్తులకు గుడ్న్యూస్ ?
ఆర్ధికంగా, సామాజికంగా మత్స్యకారులు అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తలసాని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ చేస్తున్న విషయాన్ని మంత్రి తలసాని గుర్తు చేశారు. కాళేశ్వరం, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ తదితర నూతన రిజర్వాయర్ల నిర్మాణం, మిషన్ కాకతీయ కింద శిధిలమైన చెరువులు, కుంటలను అభివృద్ధి చేయడం ద్వారా అనేక నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తలసాని అన్నారు.