ప్రభాస్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌?

Chakravarthi Kalyan
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, హీరోయిన్‌ కృతీ సనన్‌ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్‌ ఎల్లుండి విడుదల కాబోతోంది.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎల్లుండి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు సీఎం జగన్ గుడ్ న్యూస్‌ చెప్పారనుకోవాలి. ఆదిపురుష్‌ టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ చిత్రయూనిట్‌కు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ శుభ వార్త చెప్పింది.


ఆదిపురుష్‌ సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు జగన్ సర్కారు అనుమతిచ్చింది. అన్ని థియేటర్స్‌లోనూ ప్రతి టికెట్‌కు రూ.50 పెంచుకునేలా జగన్ సర్కారు  వెసులుబాటు కల్పించింది. అయితే పది రోజుల వరకు మాత్రమే టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. తెలంగాణ సర్కార్‌ కూడా టికెట్‌ రేట్ల పెంపుకు పచ్చజెండా ఊపింది. తెలంగాణలో మొదటి మూడు రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్స్‌కు రూ.50 పెంచుకునేందుకు అనుమతి ఉంది. అలాగే తొలి రోజు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: