వైసీపీ ఎంపీ.. ఛలో ఢిల్లీ పోరాటం ఫలించేనా?

Chakravarthi Kalyan
వైసీపీ ఎంపీ, బీసీల నేత ఆర్ కృష్ణయ్య ఛలో ఢిల్లీ పోరాటం చేస్తున్నారు. - కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకంగా చేస్తోన్న ఛలో డిల్లీకి బీసీలంతా తరలి రావాలని బీసీల నేత ఆర్ కృష్ణయ్య  పిలుపు ఇస్తున్నారు. బీసీ కులాల్లో ఐక్యమత్యం,నాయకత్వ లక్షణాలు పెరగాల్సిన అవసరం ఉందన్న ఆర్‌ కృష్ణయ్య..  బీసీల కోసం చేస్తోన్న  ఉద్యమాన్ని బీసీలంతా బలపరచాలన్నారు. సోషల్ మీడియా ద్వారా  ప్రభుత్వ పథకాలపై బీసీలు  విస్తృతంగా ప్రచారం చేయాలని.. పిలుపు ఇచ్చారు.


బీసీలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. జగన్ చేస్తోన్న సామాజిక న్యాయాన్ని బీసీలు అర్థం చేసుకోవాలని బీసీల నేత ఆర్ కృష్ణయ్య  అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీల పక్షపాతి అంటున్న బీసీల నేత ఆర్ కృష్ణయ్య.. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నేను కోరుతుంటే స్థానిక సంస్థల్లో సీఎం జగన్ 60శాతం పైగా రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. సీఎం  వైఎస్ జగన్ ను బీసీలంతా కాపాడుకోవాలని మద్దతివ్వాలని బీసీల నేత ఆర్ కృష్ణయ్య అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP

సంబంధిత వార్తలు: