ఫోటోగ్రఫీతో అదరగొడుతున్న ఎంపీ సంతోష్‌?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తాజాగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పర్యటించారు. ఆయన పర్యటన విశేషాలను మహారాష్ట్ర అటవీ అధికారులు మ్యాజికల్ మెల్ఘాట్ సోషల్ మీడియా పేజీ ద్వారా పంచుకున్నారు. తిప్పేశ్వర్ అభయారణ్యంలో సఫారీ ద్వారా పర్యటించిన ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన జంతువులు, పక్షుల ఫోటోలను కూడా సోషల్ మీడియా జత చేశారు.

తన పర్యటనలో తిప్పేశ్వర్ అటవీ అందాలు, విభిన్న జంతు సంపదను కెమెరా ద్వారా బంధించిన ఎంపీకి మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ అధికారులు మర్యాదపూర్వకంగా ఎంపీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల వెంట అటవీ రక్షణ, పులుల సంచారంపై ఎంపీతో చర్చించారు. అడవులు, పర్యావరణ రక్షణకు తన మద్ధతు ఎప్పుడూ ఉంటుందని సంతోష్‌ తెలిపారు. వీలున్నప్పుడల్లా వివిధ ప్రాంతాల్లో పర్యటించే సంతోష్‌ ప్రతి ఆదివారం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: