అసలు తెలంగాణలో సీఎం ఉన్నాడా?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఉన్నాడా , పాలన సాగుతున్నదా.. పాలన పక్కన పెట్టి రాజకీయమేనా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉసురు పోసుకుంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. SSC పేపర్ లీకవడం ఏమిటని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.. ఒక్క పరీక్ష కూడా ప్రభుత్వం సరిగ్గా పెట్టలేక పోతున్నదని విమర్శించారు.

ఎంసెట్ పేపర్ గతంలో 3 సార్లు లీక్ అయ్యిందన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.. మీ సర్కారు వల్ల జీవితాలు ఆగం ఐతున్నాయన్నారు. మీ చేతగాని తనం వల్ల విద్యార్థుల భవిష్యత్ గందరగోళం లో నెట్టబడుతోందన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.. ఎంతసేపూ రాజకీయలేనా అంటూ విమర్శించారు.
ఊర్లు తిరగడానికి సమయం ఉంటది కానీ సమీక్ష చెయ్యడానికి సీఎం కు టైమ్ ఉండదా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ నిలదీశారు. లీకుల నేపథ్యంలో వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: