20 ఏళ్ల కేసులో రిటైర్ అయ్యాక ఐఏఎస్కు జైలు?
కవాడి నర్సింహా ఆదాయానికి మించి రూ.32 లక్షల ఆస్తులు కూడబెట్టుకున్నారని సీబీఐ అభియోగం మోపింది. కవాడి నర్సింహా 2006లో సీబీఐ కేసు నమోదు చేసి 2010లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది హైదరాబాద్ సీబీఐ. ఏళ్ల తరబడి విచారణ జరిగిన తర్వాత కవాడి నర్సింహాకు మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే.. దర్జాగా ఐఏఎస్గా జీవితమంతా బతికిన వ్యక్తి ఇప్పుడు రిటైర్ అయ్యాక జైల్లో కూర్చోవాల్సి వస్తోంది.