2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో 22 సంవత్సరాల భారత బాక్సర్ అయిన నీతూ గంగాస్ అదరగొట్టి తన సత్తా చాటింది.ఇక శనివారం నాడు జరిగిన ఫైనల్లో మంగోలియా బాక్సర్ అయిన లుత్సాయిఖాన్ అట్లాంట్సెట్సెగ్ను 5-0 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో మొదటిసారిగా ఫైనల్ ఆడిన నీతూ గంగాస్బౌట్ ప్రారంభంతోనే ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించింది.
48 కిలోల విభాగంలో మొదటి రౌండ్లో మంగోలియన్ బాక్సర్కు ఎక్కడా కూడా సందు దొరకనీయలేదు. ఈ టోర్నీలో గంగాస్ కొరియా బాక్సర్ కాంగ్ డియోయాన్ను ఓడించడం ద్వారా తన గెలుపుని ప్రారంభించింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ దేశానికి చెందిన వడా మడోకాను మట్టికరిపించి సెమీస్లో అడుగుపెట్టింది. ఇక సెమీస్లో కూడా అలువా బెల్కిబెకోవాపై ఏకంగా 5-2 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి ఫైనల్లో ప్రవేశించింది.