అబ్దుల్లాపూర్‌మెట్ కేసులో అమ్మాయి తీరు విచిత్రం?

Chakravarthi Kalyan
అబ్దుల్లాపూర్‌మెట్ లో ఇటీవల జరిగిన నవీన్‌ దారుణ హత్య దర్యాప్తులో పోలీస్ లకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. హత్య తరువాత ...నిందితుడు తన స్నేహితుడు, స్నేహితురాలు , తండ్రి కి హత్య విషయం చెప్పాడు.. అయినా ..ఒక్కరూ కూడా పోలీస్ లకు చెప్పక పోవడం పై...ఉన్నతాధికారుల సీరియస్ అవుతున్నారు. పోలీస్ విచారణకు హరిహర కృష్ణ స్నేహితురాలు ఏ మాత్రం సహకరించట్లేదని తెలుస్తోంది.

ఇలాంటి హత్యను కూడా ...చాలా తేలికగా తీసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కస్టడీ విచారణ ముగిస్తే...  ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా ముగిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు . ఇప్పటికే హరిహర కృష్ణ స్నేహితురాలిని మూడు సార్లు విచారించిన పోలీసులు.. సఖి సెంటర్ లో కౌన్సిలింగ్ ఇప్పించినా అమ్మాయి తీరు మారలేదని చెబుతున్నారు. పేద కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబసభ్యులు.. పోలీసుల ముందు తీవ్రంగా రోదిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: