కేసీఆర్‌.. ఆ కులాలను ఎస్టీల్లో.. అలా ఎలా కలుపుతారు?

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో గిరిజనులను వంచించి కించపరిచేలా మాట్లాడారంటున్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్. సర్వే చేశామని 11 లక్షల ఎకరాలు ఉన్నట్లు చెప్పారని.. వాస్తవానికి అసలు సర్వే కూడా చేపట్టలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. పలు కులాలకు ఎస్టీ జాబితాలో కలుపుతున్నట్లు చెప్పారని.. కాయితి లంబాడీలు అనే తెగ అసలు లేనే లేదు.. మరి 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు ఎక్కడ దొరికిందో అని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు.

చెల్లప్ప కమిషన్ లో 9.08 శాతం ఎస్టీలు ఉంటే ఇతర కులాలను చేర్చి 10 శాతం చేయాలని చూస్తున్నారని.. ఎవరినీ సంప్రదించకుండా ఎలా చేస్తారని.. మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. ఇది కేసీఆర్ పారాసిటమోల్ తెలివి.. ఆయనే సయింటిస్ట్, ఆయనే డాక్టర్ అని ఫీల్ అవుతున్నట్లున్నారని.. గిరిజనులపై ప్రేమ ఉంటే గిరిజన బంధుకు నిధులు ఎందుకు కేటాయించలేదని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: